మొక్కు తీర్చుకున్న చింతమనేని
ABN, First Publish Date - 2022-01-27T05:41:23+05:30
చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి లోకేష్ కరోనా నుంచి త్వరగా కోలుకునందుకు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మొక్కు తీర్చుకున్నారు.
దెందులూరు, జనవరి 26: చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి లోకేష్ కరోనా నుంచి త్వరగా కోలుకునందుకు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మొక్కు తీర్చుకున్నారు. చల్లచింతలపూడి శివారు కొత్తకమ్మవారి గూడెంలోని అంజనేయస్వామి ఆలయంలో బుధవారం మండల టీడీపీ అధ్యక్షుడు మాగంటి నారాయణ ప్రసాద్ (మిల్లుబాబు), గ్రామ పార్టీ ఆధ్వర్యంలో చింతమనేని 101 కొబ్బరి కాయలను కొట్టి మొక్కు తీర్చుకున్నారు. తొలుత ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు రాజధాని అమరావతితో పాటు పోలవరం నిర్మాణం, ప్రజల సంక్షేమం, అభివృద్ధి మాజీ మఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబుతోనే సాధ్యమ న్నారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షుడు రొక్కం మాధవరావు, మాజీ సర్పంచ్ ముమ్మడి మోహనరావు, ఎంపీటీసీ సింహాద్రి పద్మావతి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-27T05:41:23+05:30 IST