వార్డు సచివాలయాలుగా అన్న క్యాంటీన్లు
ABN, First Publish Date - 2022-07-02T06:13:06+05:30
భీమవరం పట్టణంలో అన్న క్యాంటీన్ల కోసం గతంలో మునిసిపాలిటీ నిధులతో నిర్మించిన భవనాలను పూర్తిగా వార్డు సచివాలయాలుగా మార్చివేశారు.
భీమవరం, జూలై 1 : భీమవరం పట్టణంలో అన్న క్యాంటీన్ల కోసం గతంలో మునిసిపాలిటీ నిధులతో నిర్మించిన భవనాలను పూర్తిగా వార్డు సచివాలయాలుగా మార్చివేశారు. వన్టౌన్లో బుధవారం మార్కెట్ వద్ద ఒక సచివాలయ భవనాన్ని, పాత బస్టాండ్ వద్ద ఉన్న ఒక భవనాన్ని, జువ్వలపాలెంలోని ఒక భవనాన్ని అన్న క్యాంటీన్లుగా నడిపిన సంగతి తెల్సిందే. ప్రభుత్వం మారిన తర్వాత క్యాంటీన్లు మూసివేశారు. ఈ భవనాలను కూడా వినియోగంచలేదు. విద్యా సంస్థల ఆవరణలో సచివాలయం తొలగించాలని కోర్టు ఆదేశించడంతో ప్రత్యామ్నాయంగా ఉన్న ఈ భవనాలను సచివాలయాలుగా మార్చి వేశారు. బుధవారం మార్కెట్, పాత బస్టాండ్ భవనాల వద్ద బోర్డు ఏర్పాటు చేసి కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. జువ్వలపాలెం రోడ్డులోని భవనాన్ని పూర్తిగా అలంకరించి అన్న క్యాంటీన్ పేరు పూర్తిగా తొలగించారు.
Updated Date - 2022-07-02T06:13:06+05:30 IST