సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో విజిలెన్స్ తనిఖీ
ABN, First Publish Date - 2022-01-18T05:30:00+05:30
స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాల యంలో మంగళవారం ఏడుగురు సభ్యుల విజిలెన్స్ అధికారుల బృందం ఆకస్మిక తనిఖీ చేపట్టింది.
జంగారెడ్డిగూడెం టౌన్, జనవరి 18: స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాల యంలో మంగళవారం ఏడుగురు సభ్యుల విజిలెన్స్ అధికారుల బృందం ఆకస్మిక తనిఖీ చేపట్టింది. విజిలెన్స్ డీఎస్పీ వెంకటేశ్వరావు మాట్లాడుతూ రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండు రోజులు తనిఖీ చేస్తామన్నారు. రిజిష్ట్రేషన్లకు సంబంధించిన ప్రతీ రికార్డును పరిశీలిస్తున్నట్లు తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రికార్డులు మాయమయ్యాయని ఫిర్యాదుల మేరకు గత ఏడాది భీమడోలు, తాడేపల్లిగూడెం కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం కార్యాలయంలో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 1959 నుంచి 1999 వరకు రిజిస్ట్రేషన్లను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
Updated Date - 2022-01-18T05:30:00+05:30 IST