ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రైవేట్‌ పాఠశాలల్లో అధిక ఫీజులు నియంత్రించాలి

ABN, First Publish Date - 2022-07-07T05:17:16+05:30

నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల నుంచి ప్రైవేట్‌ పాఠశాలలు వసూలు చేస్తున్న అధిక ఫీజులను నిలువరించాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పెనుబోయిన మహేష్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

డీఈవో కార్యాలయం వద్ద నాయకుల నినాదాలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు ఎడ్యుకేషన్‌, జూలై 6 : నిబంధనలకు విరుద్ధంగా విద్యార్థుల నుంచి ప్రైవేట్‌ పాఠశాలలు వసూలు చేస్తున్న అధిక ఫీజులను నిలువరించాలని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పెనుబోయిన మహేష్‌యాదవ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం ఏలూరు డీఈవో కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుర్తింపులేని ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజు వివరాలను నోటీసుబోర్డులో ప్రదర్శించాలని కోరారు. విద్యాహక్కు చట్టం ప్రకారం అన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలల్లో 25శాతం సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం డీఈవో గంగాభవానికి వినతిపత్రాన్ని అందజేశారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా నాయకులు వేగి సిద్దు, పవన్‌, జగత్‌, మహేష్‌, సాయిరామ్‌, కిషోర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-07T05:17:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising