ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తోటపల్లి క్వారీని తనిఖీ చేసిన డీఐజీ

ABN, First Publish Date - 2022-09-28T06:18:47+05:30

ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు మంగళవారం ఆగిరిపల్లి మండల పరిధిలోని తోటపల్లి గ్రామంలో గ్రావెల్‌ క్వారీని తనిఖీ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆగిరిపల్లి, సెప్టెంబరు 27 : ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు మంగళవారం ఆగిరిపల్లి మండల పరిధిలోని తోటపల్లి గ్రామంలో గ్రావెల్‌ క్వారీని తనిఖీ చేశారు. ఇక్కడ గ్రావెల్‌ తవ్వకాలు నిలిపి వేయాలని కోర్టు ఆదేశించినా అక్రమ తవ్వకాలు కొనసాగిస్తున్నట్టుగా స్థానిక రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఈ తవ్వకాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులంటే లెక్కలేదా అని పోలీసులపై మండిపడింది. వెంటనే ఇక్కడ జరగుతున్న వ్యవహారంపై నివేదిక సమర్పించాలని డీఐజీని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్సీ రాహుల్‌ దేవ్‌ శర్మ, నూజివీడు డీఎస్పీ బి.శ్రీని వాసులు, సీఐ ఆర్‌.అంకబాబులతో కలసి డీఐజీ గ్రావెల్‌ తవ్వకాలు జరిగిన క్వారీని పరిశీలించారు. ఎస్‌ఐ ఎన్‌.చంటిబాబు తహసీల్దార్‌ ఎం.ఉదయభాస్కరరావు తదితరులు ఉన్నారు.

Updated Date - 2022-09-28T06:18:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising