ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనలో ఎవరికీ రక్షణ లేదు

ABN, First Publish Date - 2022-05-24T05:41:06+05:30

వైసీపీ పాలనలో ఏఒక్కరికి రక్షణ లేదని నియోజ కవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ పొత్తూరి రామరాజు అన్నారు.

కోమటితిప్పలో కరపత్రాలు పంపిణీ చేస్తున్న టీడీపీ నేతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ నేతల విమర్శ


మొగల్తూరు, మే 23: వైసీపీ పాలనలో ఏఒక్కరికి రక్షణ లేదని నియోజ కవర్గ టీడీపీ ఇన్‌చార్జ్‌ పొత్తూరి రామరాజు అన్నారు. కోమటితిప్ప, నీటితిప్ప గ్రామాల్లో టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నవరత్న పథకాల పంపిణీలో కోత విధి స్తున్నారని, నిత్యం మహిళలపై దాడులు, అత్యాచారాలు, వైసీపీ మద్దతుగా ఉన్న దళితులపైనా దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విద్యుత్‌, నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. వైసీపీ పాలన వైఫల్యాల పై ఆయన ఇంటింటా కరపత్రాలు పంపిణీ చేశారు. టీడీపీ మండల అధ్యక్షు డు గుబ్బల నాగరాజు, కత్తిమండ ముత్యాలరావు, బస్వాని ఏడుకొండలు, జోగి పండు, మామిడిశెట్టి సత్యనారాయణ, తిరుమాని చక్రవర్తి, పొత్తూరి శ్రీనివాసరాజు, కొపనాతి మహలక్ష్మణరావు, బండి, సుందర సత్యనారాయణ, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


బాదుడు తప్పాలంటే టీడీపీ రావాలి

ఇరగవరం: ధరల బాదుడు తప్పాలంటే టీడీపీ అధికారంలోకి రావాలని టీడీపీ మండల అధ్యక్షుడు గోపిశెట్టి రామకృష్ణ అన్నారు. అర్జునుడుపాలెంలో సోమవారం బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన మాట్లా డారు. ప్రజలకు కరపత్రాలు అందజేసి చంద్రబాబును సీఎం చేయాలని కో రారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు చుక్కా సాయిబాబు, నాయకులు బొంతు శ్రీను, కొల్లి అప్పారావు, వేండ్ర జనార్దన్‌, మల్లిపూడి త్రిమూర్తులు, సాధనాల సత్యనారాయణ, కొప్పునూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-24T05:41:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising