TDP : జీలుగుమిల్లిలో టీడీపీ ‘బాదుడే బాదుడు’ కార్యక్రమం..
ABN, First Publish Date - 2022-08-20T03:35:30+05:30
పోలవరం నియోజకవర్గంలోని జీలుగుమిల్లి మండలం పాలచర్ల గ్రామంలో టీడీపీ(TDP) ‘బాదుడే బాదుడు’(badude badudu) కార్యక్రమాన్ని నిర్వహించింది.
జీలుగుమిల్లి : ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం పాలచర్ల గ్రామంలో టీడీపీ(TDP) ‘బాదుడే బాదుడు’(badude badudu) కార్యక్రమాన్ని నిర్వహించింది. జగన్ రెడ్డి ప్రభుత్వంలో నిత్యావసరాలు, గ్యాస్, పెట్రోల్-డీజిల్, కరెంట్, ఆర్టీసీ చార్జీలు పెంపును నిరసిస్తూ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీనివాస రావు (Boragam Srinivas Rao) పాల్గొన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారంటూ వైసీపీ ప్రభుత్వంపై ఆయన మండిపడ్డారు. ప్రభుత్వ అసమర్థ విధానాలను ఇంటింటికీ వెళ్లి వివరించారు.
తెలుగుదేశం అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని బొరగం శ్రీనివాసరావు అన్నారు. రాష్ట్రాన్ని సీఎం జగన్ రాష్ట్రాన్ని అప్పులుపాలు చేసి తన జేబులు నింపుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు సుంకవల్లి సాయికృష్ణ, గ్రామ పార్టీ అధ్యక్షులు దొంగ మురళీ, ఎంపీటీసీ నాలీ శ్రీను, సీనియర్ నాయకులు గూడపాటి పుల్లయ్య, మండల తెలుగురైతు అధ్యక్షులు ఎలగల అజయ్, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ అధ్యక్షులు గారపాటి శ్రీనివాసరావు, బాజీ సత్యనారాయణ, వల్లభనేని గంగాధర్, గద్దె సుబ్రహ్మణ్యం, ఆతుకూరి సూరిబాబు, తంగల్ల వెంకట్రావు, ఉండవల్లి రామకృష్ణ, ఐటీడీపీ మండల కో ఆర్డినేటర్ తమ్మన సాంబశివరావు, పితల వెంకటేశ్వరావు, పైడిమాల కృష్ణ, గంటా సోమరాజు, నార్లపాటి సునీల్, బుడిపుటి చిరంజీవి, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గం అధ్యక్షులు బొలగానీ అఖిల్, గంటా వెంకటేశ్వర్లు, తోట బాలు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-20T03:35:30+05:30 IST