ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ పాలనలో రహదారులు అధ్వానం

ABN, First Publish Date - 2022-09-25T07:19:23+05:30

వైసీపీ పాలనలో రహదారుల పరిస్థితి అధ్వానంగా మారిందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జి విమర్శించారు.

తాడేపల్లిగూడెంలో అధ్వానంగా వున్న రహదారి వద్ద టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం అర్బన్‌/ తాడేపల్లిగూడెం రూరల్‌,  సెప్టెంబరు 24 : వైసీపీ పాలనలో రహదారుల పరిస్థితి అధ్వానంగా మారిందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వలవల బాబ్జి విమర్శించారు. శనివారం పట్టణంలోని కడకట్ల ప్రాంతం, మండలంలోని ఎల్‌.అగ్రహారంలో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్వానంగా ఉన్న కాలనీ రహదారుల వద్ద నిరసన తెలిపారు. పెరిగిన విద్యుత్త్‌, నిత్యావసర వస్తువుల ధరలను వ్యతిరేకిస్తూ పట్టణ అధ్యక్షుడు పట్నాల రాంపండు అధ్యక్షతన స్థానికులకు కరపత్రాలను పంపిణీ చేశారు. బాబ్జి మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే సీఎంగా చంద్రబాబునాయుడు రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. నాయకులు పాతూరి రాంప్రసాద్‌చౌదరి, శీలి వెంకటరత్నం, రాకేష్‌, సుందర రమాదేవి,  ముప్పిడి రమేష్‌, వాడపల్లి సుబ్బరాజు పాల్గొన్నారు. ఎల్‌.అగ్రహారంలో పార్టీ అధ్యక్షుడు పరిమి రవికుమార్‌, శీలి వెంకటాచలం, మర్లపూడి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-09-25T07:19:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising