భార్య లేని బతుకు వద్దని..
ABN, First Publish Date - 2022-01-26T05:47:23+05:30
భార్య కాపురానికి రావడంలేదని భర్త ఆత్మహత్యకు పాల్పడినట్టు కాళ్ళ పోలీసులు తెలిపారు.
దొడ్డనపూడిలో ఒకరి ఆత్మహత్య
కాళ్ళ, జనవరి 25 : భార్య కాపురానికి రావడంలేదని భర్త ఆత్మహత్యకు పాల్పడినట్టు కాళ్ళ పోలీసులు తెలిపారు. దొడ్డనపూడి గ్రామం కచ్చా గురువు ప్రాంతానికి చెందిన పెండ్ర గురవయ్య (39) గొడవల నేపథ్యంలో తన భార్యతో రెండేళ్లగా విడిగా ఉంటున్నాడు. పెద్ద కుమారుడు తండ్రి వద్ద.. చిన్న కుమారులిద్దరూ భార్య వద్ద ఉంటున్నారు.ఇదిలా ఉండగా ఈ నెల 20వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో భార్య కాపురానికి రావడంలేదని మనస్తాపా నికి గురై ఉరి వేసుకున్నాడు. గమనించిన పెద్ద కుమారుడు గురవయ్యను భీమవరం ఆసుపత్రికి తరలించాడు.అక్కడ నుంచి మెరుగైన వైద్యం నిమిత్తం ఏలూ రు,విజయవాడ తరలించారు. విజయవాడలో చికిత్సపొందుతూ 24న మృతిచెం దినట్టు పోలీసులు తెలిపారు.మృతుడి తల్లి పాపాయమ్మ ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాం బాబు ఆధ్వర్యంలో స్టేషన్ రైటర్ రమణ కేసు నమోదు చేశారు.
Updated Date - 2022-01-26T05:47:23+05:30 IST