కాలువలో మునిగి విద్యార్థి మృతి
ABN, First Publish Date - 2022-01-29T06:04:46+05:30
పుట్లగట్లగూడెం సమీపంలో ఎర్రకాలువ పంట కాలువలో శుక్రవారం స్నానానికి దిగిన విద్యార్థి నీట మునిగి మృతి చెందాడు.
జంగారెడ్డిగూడెం, జనవరి 28: పుట్లగట్లగూడెం సమీపంలో ఎర్రకాలువ పంట కాలువలో శుక్రవారం స్నానానికి దిగిన విద్యార్థి నీట మునిగి మృతి చెందాడు. జంగారెడ్డిగూడెంకు చెందిన పెద్దిరెడ్డి సంతోష్కుమార్ (15), అతని సోదరుడు సురేష్, మరో ఐదుగురు విద్యార్థులు కలిసి ఎర్రకాలువ పంట కాలువ వద్దకు వచ్చారు. పాఠశాలకు అని చెప్పి వీరంతా ఉదయం 9:30 గంటలకు సమయంలో కాలువ వద్దకు వెళ్లారు. వారిలో సురేష్ తప్ప సంతోష్కుమార్తోపాటు అందరూ కాలువలో స్నానానికి దిగారు. స్నానం చేస్తున్న సంతోష్కుమార్ ఒక్కసారిగా నీటిలో మునిగిపోయాడు. కళ్ల ముందే తన సోదరుడు మునిగిపోవడంతో సురేష్ కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే సంతోష్కుమార్ గల్లంతవడంతో గాలింపు చర్యలు చేపట్టారు. కొద్దిసేపటికి అతడి మృతదేహాన్ని వెలికితీశారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుత్రికి తరలించారు.
–––––––––––––––––––––––––
Updated Date - 2022-01-29T06:04:46+05:30 IST