ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధి పనులకు అడ్డొస్తున్నారు..

ABN, First Publish Date - 2022-06-27T06:49:43+05:30

సర్పంచ్‌గా ఎన్నికైన దగ్గర నుంచి వేధింపులకు గురిచేస్తూ అభివృద్ధి పనులకు అధికారపక్ష నేతలు అడ్డుపడుతున్నారని కోరుకొల్లు సర్పంచ్‌ బట్టు లీలా కనకదుర్గ ఆరోపించారు.

సర్పంచ్‌ కనకదుర్గ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రూ.5 లక్షల మట్టిని అమ్ముకున్నారు

అధికార పక్ష నేతలపై కోరుకొల్లు సర్పంచ్‌ ఆరోపణలు

కలిదిండి, జూన్‌ 26: సర్పంచ్‌గా ఎన్నికైన దగ్గర నుంచి వేధింపులకు గురిచేస్తూ అభివృద్ధి పనులకు అధికారపక్ష నేతలు అడ్డుపడుతున్నారని కోరుకొల్లు సర్పంచ్‌ బట్టు లీలా కనకదుర్గ ఆరోపించారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ గ్రామంలో పారిశుధ్య పనుల నిర్వహణకు సహకరించటం లేదన్నారు. కొంత మంది డ్రైనేజీలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో  రోడ్లపైకి మురుగునీరు వస్తోందన్నారు. అక్రమ కట్టడాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించు కోవటం లేదన్నారు. పారిశుధ్య వాహనాలున్నా వినియోగించటం లేదన్నారు.  ఈ విషయమై  అప్పటి కృష్ణా జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానన్నారు. పంచాయతీ షాపుల వేలానికి సహకరించకపోవటంతో పంచాయతీ ఆదాయానికి రావడం లేదన్నారు. చైతన్యపురంలో మంచినీటి చెరువు పూడికతీత పేరిట సుమారు రూ. 5 లక్షల విలువైన మట్టిని బయటకు అమ్ముకున్నారని ఆరోపించారు. పాలకవర్గ సభ్యులు, అధికారులు సహకరిస్తే వెంటనే పారిశుధ్య పనులు చేపడతామన్నారు. 

Updated Date - 2022-06-27T06:49:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising