ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైభవంగా మహా కుంభాభిషేకం

ABN, First Publish Date - 2022-11-28T23:51:11+05:30

పద్మావతి వేంకటేశ్వరస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం ఉత్సవాలు సోమవారం ముగిశాయి.

కలశాలతో ఆలయ ప్రదక్షిణ, ఆలయ శిఖరానికి మహా కుంబాభిషేకం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం టౌన్‌, నవంబరు 28: పద్మావతి వేంకటేశ్వరస్వామి ఆలయంలో మహా కుంభాభిషేకం ఉత్సవాలు సోమవారం ముగిశాయి. అలయ అర్చకుడు వాడపల్లి ఆదినారాయణాచార్యులు ఆధ్వర్యంలో రుత్వికులు విశ్వక్వేనపూజ, పుణ్యాహవచనం, అష్టబంధన, సప్త కలశారాధన, నవ కలశారాధన చేశారు. ఆలయ ప్రదక్షిణ అనం తరం కలశాల్లోని మంత్ర జలాలతో ఆలయ శిఖరానికి మహా కుంభాభిషేకం చేశారు. గోదర్శనం, దర్పదర్శనం చేయించారు. తదుపరి పూర్ణాహుతితో కార్యక్రమా న్ని పరిసమాప్తి చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో ఆర్‌ గంగా శ్రీదేవి, చైర్మన్‌ మంతెన రామ్‌కుమార్‌రాజు, ధర్మకర్తలు తదితరులు పాల్గొన్నారు.

క్షీరా రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక అభిషేకాలు

పాలకొల్లు అర్బన్‌, నవంబరు 28: క్షీరా రామలింగేశ్వరస్వామికి సోమవారం ప్రత్యేక ఏకవార రుద్రాభిషేకాలు, అమ్మవార్లకు కుంకు మ పూజలు నిర్వహించారు. గోశాలలో గోపూ జలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి వారిని దర్శించుకున్నారు. సాయంత్రం పంచ హారతులు ఇచ్చి ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ ఈవో యాళ్ళ సూర్యనారాయణ, పాలక మండలి చైర్మన్‌ కోరాడ శ్రీనివాసరావు, ట్రస్టీలు, భక్తులు పాల్గొన్నారు. శంకర మఠం, శంభేశ్వర స్వామివారికి అభిషేకాలు, అమ్మవార్లకు పూజలు చేశారు.

Updated Date - 2022-11-28T23:51:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising