లాభాల పంట కీర దోస
ABN, First Publish Date - 2022-02-01T05:46:49+05:30
మెట్ట ప్రాంత రైతులకు కీర దోస సాగు లాభసాటిగా ఉంది.
నల్లజర్ల, జనవరి 31: మెట్ట ప్రాంత రైతులకు కీర దోస సాగు లాభసాటిగా ఉంది. బోరు బావుల సాయంతో పలు రకాల కూరగాయల పంటలను రైతులు పండిస్తున్నారు. ఎకరాకు రూ.20వేలు పెట్టుబడి అవసరం. ప్రస్తుతం మార్కెట్లో కీర 10 కిలోలు రూ.250 ధర పలుకుతుంది. డిమాండ్ను బట్టి ఎకరాకు రూ.60 నుంచి రూ.70 వేలు ఆదాయం పొందే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.
కీరదోస లాభసాటి
గతంలో దొండ పంట వేసి ధర లేక రెండు లక్షల వరకు నష్టపోయాను. ఎకరానికి రూ.20వేలు పెట్టుబడి పెట్టి కీర దోస సాగు వేశాను. మార్కెట్లో 10 కిలోలు రూ.250 ధర పలుకుతోంది. ఇప్పటికే రూ.30 వేలు ఆదాయం వచ్చింది.
పదిలం పండు, రైతు, తిమన్నపాలెం
Updated Date - 2022-02-01T05:46:49+05:30 IST