ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వ్యాపారాభివృద్ధికి ఫ్లెక్సీ కడుతూ...

ABN, First Publish Date - 2022-01-20T06:22:10+05:30

ముదునూరు పాడులో విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.

సతీష్‌కుమార్‌ మృతదేహం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లిగూడెం రూరల్‌, జనవరి 19: ముదునూరు పాడులో విద్యుదాఘాతంతో ఒకరు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. తాడేపల్లిగూడేనికి చెందిన పి. సతీష్‌కుమార్‌ (24) తన స్నేహితుడు పాపారావుతో కలిసి ఆటో స్పేర్స్‌ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. బుధవారం  పాపారావుతో పాటు మరో యువకుడు రాంబాబుతో కలసి  ఒక భవనం పైకి వెళ్లి వ్యాపారానికి సంబంధించిన ఫ్లెక్సీ కడుతుండగా 11 కేవి వైర్లు తగలడంతో సతీష్‌కుమార్‌  విద్యుదాఘాతానికి గురై  పడిపోయాడు. ఇతనితో పాటు ఉన్న ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి.  సతీష్‌కుమార్‌ను తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్టు వైద్యులు నిర్థారించారు.  ఎస్‌ఐ జీజే ప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-01-20T06:22:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising