సూది రంధ్రంలో మువ్వన్నెల జెండా
ABN, First Publish Date - 2022-08-13T05:34:35+05:30
అతను సూక్ష్మంలో అద్భుతాలు సృష్టించగలడు.
ఏలూరు రూరల్, ఆగస్టు 12: అతను సూక్ష్మంలో అద్భుతాలు సృష్టించగలడు. బియ్యం గింజలపై కళా కండాలు చెక్కి ఔరా అనిపిస్తాడు. ఇప్పటికే తన కళా తృష్ణతో రెండు సార్లు లిమ్కా బుక్ఆఫ్ రికార్డులు సాధించాడు. ఏలూరు జిల్లా ఏలూరుకు చెందిన మేతర సురేష్ తాజాగా సూది రంధ్రంలో అగ్గిపుల్లపై అతి సూక్ష్మంగా త్రివర్ణ పతాకాన్ని చెక్కి అందరినీ అబ్బురపరిచాడు. అగ్గిపుల్లపై వివిధ కళాకండాలు చెక్కడంలో దిట్ట. సురేష్బాబు మాత్రం తమ సూక్ష్మకళతో దేశ భక్తిని వినూత్నంగా ప్రదర్శించారు.
Updated Date - 2022-08-13T05:34:35+05:30 IST