ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రియురాలి భర్త హత్య

ABN, First Publish Date - 2022-08-18T07:00:06+05:30

ప్రియురాలి భర్తను అంత మొందిస్తే.. ఆమెతో జీవితాంతం కలిసి ఉండవచ్చని భావించాడో ప్రియుడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాశ్వత సుఖం కోసం ప్రియుడి ఘాతుకం

ఏలూరు క్రైం, ఆగస్టు 17 : ప్రియురాలి భర్తను అంతమొందిస్తే.. ఆమెతో జీవితాంతం కలిసి ఉండవచ్చని భావించాడో ప్రియుడు. ప్లాన్‌ ప్రకారం.. అతని పీక కోసి నరికి చంపేశాడు. కానీ, చివరకు కటకటాలపాలై ఊచలు లెక్క పెడుతున్నాడు. పెదపాడు మండలం వసంతవాడ లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఏలూ రు రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో డీఎస్పీ జీవీవీ పైడేశ్వరరావు తెలిపిన వివరాలివి.. దిరిశన వీర్రాజు(29) కృష్ణా జిల్లా ఆగిరిపల్లి మండలం ఈదులగూడేనికి చెందిన కలపాల లక్ష్మితో మూడేళ్ళ క్రితం వివాహమైంది. వీరికి ఏడు నెలల బాబు ఉన్నాడు. వివాహానికి ముందు శ్రావణికి ఈదుల గూడేనికి చెందిన ముళ్ళపూడి దిలీప్‌తో వివాహేతర సం బంధం ఉంది. ఈ క్రమంలో లక్ష్మి అత్తవారింట్లో గొడవ పడి పుట్టింటికి వెళ్లిపోయింది. దిలీప్‌ కూడా తరచూ వీర్రాజు ఇంటికి వస్తూ పరిచయం పెంచుకుని కలిసి మద్యం సేవిస్తూ ఉండేవారు. కొద్ది రోజుల క్రితం వీర్రాజు తన భార్యను తీసుకురావడానికి ఈదులగూడెం వెళ్లాడు. ఇకపై ఆమెను కలవడానికి కుదరదని విషయం లక్ష్మికి చెప్పాడు. వీర్రాజును అంతమొందిస్తే ఆమె తన సొంత మవుతుందని భావించి ఈ నెల 9న వీర్రాజును వసంత వాడలోని దేవుడి మాన్యం పొలం వద్దకు తీసుకువెళ్లాడు. అక్కడ కత్తితో మెడపై కోసి పరారయ్యాడు. మృతుని తల్లి దేవమాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి లక్ష్మిని విచారించారు. రూరల్‌ సీఐ ఎన్‌.దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు దిలీప్‌ కోసం గాలించి అరెస్ట్‌ చేశారు. హత్యకు ఉపయోగించిన మోటారు సైకిల్‌, మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 


Updated Date - 2022-08-18T07:00:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising