Janasena: రోడ్డు సమస్యపై జనసేన జలదీక్ష
ABN, First Publish Date - 2022-09-13T01:42:23+05:30
Janasena
చింతలపూడి: చింతలపూడి నగర పంచాయతీలోని భట్టువారిగూడెం నుంచి బాలువారిగూడెం వెళ్ళే రోడ్డు గతుకులమయమై ప్రమాదకరంగా మారిందని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఏలూరు జిల్లా చింతలపూడి మండలం భట్టువారిగూడెం వద్ద జనసేన నాయకులు రోడ్డుపై బురదలో బైఠాయించి జల దీక్ష చేపట్టారు. కొద్దిసేపు ప్రజల ప్రాణాలు కాపాడాలంటూ నినాదాలు చేశారు. రోడ్డు సమస్య పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ రోడ్డులో ప్రతీరోజూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులుగాని, ప్రజా ప్రతినిధులకు గాని కనిపించడం లేదని విమర్శించారు. సాయంత్రం ఎట్టకేలకు నగర పంచాయతీకి చెందిన అధికారి ఒకరు ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని కమిషనర్ తరపున హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
Updated Date - 2022-09-13T01:42:23+05:30 IST