రష్యా– ఉక్రెయిన్ యుద్ధం వల్ల విద్యుదుత్పత్తి లేదు
ABN, First Publish Date - 2022-05-18T06:25:21+05:30
రష్యా– ఉక్రెయిన్ యుద్ధం వల్ల విద్యుదుత్పత్తి లేదు
సోషల్ మీడియాలో ఎమ్మెల్యే గ్రంధి వ్యాఖ్యలు వైరల్
భీమవరం, మే 17: ‘గడపగడపకూ మన ప్రభుత్వం’లో భాగంగా ఎమ్మెల్యే ఇంటింటికీ తిరుగుతుండగా వీరవాసరం మండలం నేలపోగు గ్రా మంలో ఒక వృద్ధ మహిళ... అన్ని బాగున్నాయి కానీ కరెంట్ బిల్లులు ఎక్కువ రావటంతో ఇబ్బంది పడుతున్నామని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ దృ ష్టికి తీసుకువచ్చింది. ఆ మహిళ ప్రశ్నకు ఎమ్మెల్యే శ్రీనివాస్ ఇచ్చిన వివరణ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అయింది. ‘‘రష్యాకు, ఉక్రెయిన్కు మధ్య యుద్ధం జరుగుతోంది కదా దాని వల్ల బొగ్గు సరఫరా ఆగిపోయింది. బొగ్గురేటు పెరిగిపోయింది. విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయింది.’’ అన్న వ్యాఖ్యలు వైరల్గా మారడంతో పలువురు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు.
Updated Date - 2022-05-18T06:25:21+05:30 IST