పట్టణాభివృద్ధికి సహకరించండి : ఆర్డీవో
ABN, First Publish Date - 2022-05-23T05:30:00+05:30
పట్టణాభివృద్ధికి దాతలు, స్వచ్చంద సంస్థలు సహకరించాలని ఆర్డీవో దాసి రాజు కోరారు.
భీమవరం టౌన్, మే 23: పట్టణాభివృద్ధికి దాతలు, స్వచ్చంద సంస్థలు సహకరించాలని ఆర్డీవో దాసి రాజు కోరారు. మునిసిపాల్టీలో పట్టణ ప్రముఖులు, వ్యాపారులు, వివిధ సంస్ధల ప్రతినిధులతో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ మాట్లాడుతూ ప్రధాన రహదారుల పక్కన ఆక్రమణలు తొలగించామన్నారు. రోడ్డు సెంటర్ డివైడర్లు, పచ్చదనం, లైటింగ్, ఎల్ఈడీ స్ర్కీన్స్ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశానికి హాజరైన ప్రముఖులు సహకారం అందిస్తామన్నారు. మానేపల్లి సూర్యనారాయణగుప్త, కాగిత వెంకట రమణ, ఇర్రింకి సూర్యారావు, ఎంఈ పి.శ్రీకాంత్, డీఈ తోట వెంకట నారాయణరావు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-05-23T05:30:00+05:30 IST