మహానాడు విజయవంతం చేయాలి
ABN, First Publish Date - 2022-05-24T05:41:26+05:30
ఒంగోలులో ఈ నెల 27, 28 తేదిల్లో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు సభను జయప్రదం చేయాలని టీడీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) కార్యకర్తలకు పిలుపుని చ్చారు
ఏలూరు టూటౌన్, మే 23: ఒంగోలులో ఈ నెల 27, 28 తేదిల్లో జరగనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు సభను జయప్రదం చేయాలని టీడీపీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) కార్యకర్తలకు పిలుపుని చ్చారు. బడేటి క్యాంపు కార్యాలయంలో సోమవారం మహానాడు సన్నాహక సభ నిర్వహించారు. 27వ తారీఖు ప్రముఖ నాయకులు, జిల్లా, రాష్ట్ర నాయకు లంతా హాజరు కావాలన్నారు. 28వ తేదీన కార్యకర్తలంతా హాజరు కావాల న్నారు. మహానాడుకు వెళ్లే ఏర్పాట్లను పరిశీలించాలని నాయకులకు సూచిం చారు. చోడే వెంకటరత్నం, దాసరి ఆంజనేయులు, లంకపల్లి మాణిక్యాలరావు, సూర్యనారాయణ, మారం హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.
బుట్టాయగూడెం : మహానాడును తెలుగుదేశం పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడు విజయవంతం చేసి చంద్రబాబును మరలా ముఖ్యమంత్రిని చేయ డానికి కృషి చేయాలని పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బొరగం శ్రీని వాస్ పిలుపునిచ్చారు. సోమవారం బుట్టాయగూడెం క్యాంపు కార్యాలయంలో జరిగిన మహానాడు సన్నాహక సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బాదుడే– బాదుడు కార్యక్రమంతో టీడీపీ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పర్యటిస్తున్నదని క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషిచేయాలన్నారు. వైసీపీ పాలనపై ప్రజలు విసిగిపోయారని, పథకాలు అందక అవస్థలు పడుతున్నారని తెలిపారు. గ్రామాల్లో పర్యటిస్తున్న టీడీపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్న విషయాన్ని మర్చిపోకూడదన్నారు. ఇప్పటి నుంచే ప్రతి కార్యకర్త శక్తివంచన లేకుండా పనిచేయాలని కోరారు. అలాగే మహానాడును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు యంట్రప్రగడ శ్రీనివాసరావు, మొగపర్తి సోంబాబు, పారేపల్లి రామారావు, మలిశెట్టి నాగు, వాడపల్లి నాగార్జున, అమరవరపు ఆశోక్, బొడ్డి కృష్ణ, జయ వరపు శ్రీరామచంద్రమూర్తి, మనెల్లి బాలు, గద్దె అబ్బులు, కలగర రాము, కుందుల శ్రీను, గుండేబేని మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
నేడు నిడమర్రులో మినీ మహానాడు
గణపవరం, మే 23: ఆంధ్రప్రదేశ్కు తిరిగి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే కావాలని ప్రజలు కోరుకుంటున్నారని గణపవరం మండల టీడీపీ అధ్యక్షుడు ఇందుకూరి రామకృష్ణంరాజు అన్నారు. ఈనెల 24న మంగళవారం సాయంత్రం నిడమర్రులో జరిగే నియోజకవర్గ మినీ మహానాడును విజ యవంతం చేయాలని మండల గ్రామాల్లో పర్యటించారు. ఆయా కూడలిలో మాట్లాడుతూ ఇందుకూరి మాట్లాడుతూ మూడేళ్ల వైసీపీ పాలనలో ప్రజలు వరిగిందేమీ లేదన్నారు. భావితరాల కోసం ప్రజ లంతా ఒక్కసారి ఆలోచించాలని పిలుపునిచ్చారు. మిని మహానాడులో ప్రతీ ఒక్కరుపాల్గొని విజయ వంతం చేయాలని కోరారు.జిల్లా బీసీ సెల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి యాళ్ళసుబ్బారావు, ఉంగుటూరు నియోజకవర్గ టీడీపీ యువత అధ్యక్షుడు అద్దేపల్లి శ్రీనివాస సత్య నారాయణరాజు (వాసురాజు), జిల్లా రైతు సంఘం కార్యదర్శి కవల కొదండ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-05-24T05:41:26+05:30 IST