ఆకివీడు ‘స్పందన’లో రెండే అర్జీలు
ABN, First Publish Date - 2022-05-24T05:33:03+05:30
తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో రెండు అర్జీలు వచ్చినట్లు ఎంపీడీవో శ్రీకర్, తహసీల్దార్ నీలాపు గురుమూర్తి సోమవారం తెలిపారు.
ఆకివీడు, మే 23: తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో రెండు అర్జీలు వచ్చినట్లు ఎంపీడీవో శ్రీకర్, తహసీల్దార్ నీలాపు గురుమూర్తి సోమవారం తెలిపారు. 2021 ఖరీఫ్ ఇన్పుట్ సబ్సిడీ రాలేదని గుమ్ములూరుకు చెం దిన జక్కంపూడి రత్నమాణిక్యం, ఇండ్ల స్థలం కోసం షేక్ పనీసలా ఆర్జీ ఇచ్చారు. కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వరరావు, ఏవో ప్రియాంక, హౌసింగ్ ఏఈ భాస్కరరాజు, ఏఈ రమణమ్మ, విద్యుత్ ఏఈ ప్రసాద్రాజు ఉన్నారు.
ఉండిలో అర్జీలే లేవు
ఉండి: ఉండిలో జరిగిన స్పందన కార్యక్రమంలో దరఖాస్తులు రాలేదని తహసీల్దారు కృష్ణజ్యోతి తెలిపారు. సోమవరం ఉద యం నుంచి తాము కార్యాలయంలో అర్జీలు స్వీకరించడానికి ఉన్నామని ప్రజలు అర్జీ పెట్టుకోడానికి ఎవరు రాలేదని ఆమె తెలిపారు.
Updated Date - 2022-05-24T05:33:03+05:30 IST