కృష్ణాష్టమి వేడుకలకు ఆలయాలు ముస్తాబు
ABN, First Publish Date - 2022-08-19T05:08:54+05:30
కృష్ణాష్టమి వేడుకలకు ఆలయాలు ముస్తాబయ్యాయి.
పెంటపాడు, ఆగస్టు 18: కృష్ణాష్టమి వేడుకలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. అలంపురం పెనుమర్తి భూలోకరాయుడు వీధిలో శ్రీకృష్ణ మందిరంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేక అలంకరణ చేశా రు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ శుక్రవారం కృష్ణాష్టమి వేడుకల అనంతరం భారీ ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. ఈనెల 23 వరకు ఆల యం వద్ద ప్రత్యేక కార్యక్రమం, 24న అన్నసమారాధన జరుగుతుందన్నారు.
వీరవాసరం: శ్రీకృష్ణ జన్మాష్టమి, ఉట్టి పండుగకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీరవాసరంలోని రుక్త్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి దేవస్థానంలో వేడుకలను వైభవంగా నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలో ఉట్టికొట్టిన అనంతరం గ్రామంలో ఉట్లు కొట్టటం ఆనవాయితీ. మార్కెట్ ఏరియా మురళీకృష్ణ మండపం, పల్లపువీధి, సువర్చలా సమేత సంజీవ ఆంజనేయస్వామి ఆలయంతో పాటు వివిద వీధుల్లో ఉట్టి పండుగకు యువకులు సన్నాహాలు చేస్తున్నారు.
Updated Date - 2022-08-19T05:08:54+05:30 IST