ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bhimavaramకు బయలుదేరిన కేంద్ర మంత్రి Kishan Reddy

ABN, First Publish Date - 2022-06-12T15:30:13+05:30

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్‌కు చేరుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Krishna జిల్లా: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్‌కు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు, పలువురు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి కిషన్ రెడ్డి రోడ్డు మార్గాన నేరుగా భీమవరంకు బయలుదేరారు.


కిషన్ రెడ్డి ఆదివారం భీమవరంలో పర్యటించనున్నారు. జూలై 4న భీమవరంలో ప్రధాని మోదీ పాల్గొనే  అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాల ఏర్పాట్లను కిషన్ రెడ్డి పరిశీలించనున్నారు. ఉదయం 10 గంటలకు మోగల్లు చేరుకుని  విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నివాళి అర్పించి, అల్లూరి ధ్యాన మందిరాన్ని సందర్శించనున్నారు. అనంతరం అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కళా కేంద్రంలో క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. బీజేపీ జిల్లా కమిటీ ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో కిషన్ రెడ్డితో పాటు సోము వీర్రాజు, స్థానిక నేతలు పాల్గొననున్నారు. 

Updated Date - 2022-06-12T15:30:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising