ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇసుక లారీలను అడ్డుకున్న జనసేన

ABN, First Publish Date - 2022-05-27T05:32:11+05:30

ఇసుక రవాణా లారీలతో రహదారి అధ్వానంగా మారిందని, దేవస్థానం టోల్‌ గేట్‌ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన మండల అధ్యక్షుడు కంబాల బాబు అన్నారు.

ఇసుక లారీలను అడ్డుకుని నిరసన తెలుపుతున్న జనసేన కార్యకర్తలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రహదారి అధ్వానంగా మారిందని ఆందోళన

పెనుగొండ, మే 26: ఇసుక రవాణా లారీలతో రహదారి అధ్వానంగా మారిందని, దేవస్థానం టోల్‌ గేట్‌ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన మండల అధ్యక్షుడు కంబాల బాబు అన్నారు. సిద్దాంతం కేదార్‌ ఘాట్‌లో ఇసుక ర్యాంప్‌ టోల్‌గేట్‌ వద్ద గురువారం జనసేన కార్యకర్తలు ఇసుక లారీలను అడ్డుకుని నిరసన తెలిపారు. లారీల నుంచి టోల్‌ పేరుతో అధిక వసూళ్లకు పాల్పడుతూ బురదమయం, గుంతలతో ఉన్న రోడ్లను పూడ్చకుండా వదిలేశారన్నారు. ఈ దారి గుండా శ్మశాన వాటికకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గ్రామ పంచాయతీకి ఆదాయం రాకుండా అధికారులు అండదండలతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారన్నారు. దీనిపై అధి కారులు, ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని, లేకుంటా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎస్‌ఐ బండి మోహనరావు సమస్య పరిష్కారానికి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Updated Date - 2022-05-27T05:32:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising