ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికారుల ఆదేశాలు బేఖాతర్‌

ABN, First Publish Date - 2022-05-22T05:44:42+05:30

పంజా వేమవరం–లంకలకోడేరు రహదారిపై ఉమా మూలేశ్వరస్వామి ఆలయానికి చేర్చి రహదారులు భవనాలు శాఖ స్థలంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభం అయ్యాయి.

కప్పు వేసి ప్లాస్టింగ్‌ చేసిన దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వీరవాసరం, మే 21 : పంజా వేమవరం–లంకలకోడేరు రహదారిపై ఉమా మూలేశ్వరస్వామి ఆలయానికి చేర్చి రహదారులు భవనాలు శాఖ స్థలంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభం అయ్యాయి. గతంలో ఈ స్థలంలో ఉన్న కట్టడాన్ని పునర్నిర్మాణం చేస్తున్న వ్యవహారంలో గ్రామస్థుల నుంచి అధికారులకు పిర్యాదులు అందాయి. దీనిపై ఏప్రిల్‌ 27న ‘ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన తహసీల్దార్‌ ఎం.సుందరరాజు, రహదారుల భవనాలశాఖ ఏఈ మూర్తి, పంచాయతీ అధికారులు అక్రమ నిర్మాణాన్ని నిలుపుదల చేశా రు. పనులు కొనసాగించరాదని స్పష్టం చేశారు. అయినప్పటికీ కొద్దిరోజులుగా స్తబఽ్ధతగా ఉండి మళ్లీ అక్రమ నిర్మాణ పనులు ప్రారంభించారు. గోడలపై కప్పు వేయడమే కాకుండా సిమెంట్‌ ప్లాస్టింగ్‌ పనులను త్వరితగతిన పూర్తిచేస్తున్నారు. ఇది అఽధికారుల దృష్టికి రాకపోవడం గమనార్హం. ఈ కట్టడం వల్ల దేవాలయం మండపానికి, దేవాలయానికి ఇబ్బంది ఉన్నప్పటికీ దేవదాయ ధర్మదాయశాఖ అధికారులు గాని, పాలకమండలిగాని పట్టించుకోకుండా అక్రమ నిర్మాణాన్ని ప్రోత్సహిస్తున్నారని భక్తులు, గ్రామస్థులు విమర్శిస్తున్నారు.

Updated Date - 2022-05-22T05:44:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising