ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జోరు వాన

ABN, First Publish Date - 2022-09-29T06:32:20+05:30

పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా జిల్లాలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.

మండవల్లిలో ప్రధాన రహదారిపై నిలిచిన వర్షపునీరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అత్యధికంగా మండవల్లిలో 148.4 మిల్లీమీటర్లు వర్షపాతం 

కైకలూరు, ముదినేపల్లిలో భారీ వర్షం.. రహదారులు జలమయం


ఏలూరుసిటీ, సెప్టెంబరు 28: పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా జిల్లాలో ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం కైక లూరు, మండవల్లి, ముదినేపల్లి, పోలవరం, చింతలపూడి, లింగపాలెం, భీమడోలు మండలం లోని పూళ్ళ, పోలసానిపల్లి, ముసునూరులో భారీ వర్షం కురిసింది. కైకలూరులో రహదారులు చెరువుల్లా మారాయి.పల్లపు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. గడచిన 24 గంటల్లో జిల్లాలో అత్యఽధికంగా మండవల్లి మండలంలో 148.4 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదవగా జిల్లాలో సరాసరి వర్షపాతం 14.5 మి.మీ నమోదైంది. కైకలూరులో 94, ముదినేపల్లిలో 90.6, కలిదిండిలో 43.4, ఏలూరులో 12.4, పెదపాడులో 9.6,ముసునూరులో 6.3 మి.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. చింతలపూడి, కైకలూరులో 2 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసింది. మెట్ట ప్రాంతాల్లో ఈ వర్షం పంటలకు అనుకూలిస్తుం దని చెబుతున్నారు. కొన్ని చోట్ల భారీ వర్షాల వల్ల పంటచేలు మునిగిపోయాయి. 

Updated Date - 2022-09-29T06:32:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising