వర్షంతో మునిగిన రహదారులు
ABN, First Publish Date - 2022-07-07T05:13:54+05:30
వర్షంతో రహదారులు కాలువలుగా మారుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున కురిసిన వర్షంతో డ్రెయినేజీలు బిగదన్ని రహదారిపై మూడు అడుగుల నీరు చేరింది.
ఉండి, జూలై 6: వర్షంతో రహదారులు కాలువలుగా మారుతున్నాయి. బుధవారం తెల్లవారుజామున కురిసిన వర్షంతో డ్రెయినేజీలు బిగదన్ని రహదారిపై మూడు అడుగుల నీరు చేరింది. స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కాపులపేటలో రేషన్ దుకాణం రోడ్డు పక్కనే డ్రెయినేజీ పూడుకుపో రహదారి మునిగింది. వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి సంత మార్కెట్ రహదారిలో వర్షపు నీటితో తిప్పలు తప్పలేదు. మంచినీటి చెరువు, పీహెచ్సీ వద్ద రహదారులు నీట మునిగాయి. పంచాయతీవారు రహదారిని ముంపును పట్టించుకోకపోవడంపై స్థానికులు మండిపడ్డారు. తక్షణమే డ్రెయిన్లు శుభ్రం చేయాలని, కచ్చాడ్రెయిన్లు ఏర్పాటుచేసి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - 2022-07-07T05:13:54+05:30 IST