పాదయాత్రకు ఘనస్వాగతం
ABN, First Publish Date - 2022-07-04T05:58:43+05:30
పాదయాత్రకు ఘనస్వాగతం
కైకలూరు, జూలై 3: అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ సందర్భంగా బీజేపీ నాయకుడు లావేటి వీరశివాజీ కైకలూరులో ప్రారంభించిన మహాపాదయాత్ర రెండోరోజు ఆదివారం కొనసాగింది. కైకలూరు మండలం భుజబలపట్నం నుంచి వదర్లపాడు, శీతనపల్లి మీదుగా దొడ్డిపట్ల గ్రామానికి చేరుకోగా గ్రామ ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం రామవరం, చినతాడినాడ, సున్నంపూడి మీదుగా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుపాడుకు చేరుకుని రాత్రికి భీమవరం చేరుకున్నారు. గ్రామగ్రామాన ప్రజలు స్వాగతం పలికారు. అల్లూరి పోరాట స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకే మహా పాదయాత్ర చేసినట్టు లావేటి వీరశివాజీ తెలిపారు.
Updated Date - 2022-07-04T05:58:43+05:30 IST