వశిష్ఠ గోదావరికి వరదపోటు
ABN, First Publish Date - 2022-07-12T00:53:29+05:30
ఎగువ నుంచి వరద నీరు పోటెత్తడంతో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద సోమవారం వశిష్ఠ గోదావరి నిండు కుండలా మారింది.
నరసాపురం: ఎగువ నుంచి వరద నీరు పోటెత్తడంతో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద సోమవారం వశిష్ఠ గోదావరి నిండు కుండలా మారింది. గడిచిన 24 గంటల నుంచి సుమారు 2.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. మంగళవారం నాటికి మరో మూడు లక్షల క్యూసెక్కుల నీరు వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికతో అధికార యంత్రాంగం అప్రమత్తమైయింది. సిద్ధాంతం నుంచి నరసాపురం వరకు సుమారు 40 కిలోమేటర్ల మేర గోదా వరికి ఏటిగట్టు ఉంది. ప్రతి ఆరు కిలోమీటర్లకు ఒక లస్కర్ను నియమించి నీటి ఉధృతికి గట్టు కోతకు గురికాకుండా పర్యవేక్షిస్తున్నారు. గట్లు బలహీనంగా ఉన్న ప్రదేశాల్లో ఇసుక బస్తాలతో పటిష్ట పరుస్తున్నారు.
Updated Date - 2022-07-12T00:53:29+05:30 IST