పాలకొల్లు డీఎన్ఆర్ ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ర్యాలీ
ABN, First Publish Date - 2022-11-26T00:02:39+05:30
అంతర్జాతీయ స్ర్తీ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డీఎన్ఆర్ ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
పాలకొల్లు అర్బన్, నవంబరు 25: అంతర్జాతీయ స్ర్తీ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా డీఎన్ఆర్ ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. సీపీడీసీ సభ్యుడు, హైకోర్టు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ ర్యాలీ ప్రారంభించారు. యువతులు ఆత్మస్థైర్యంతో ఉం డాలని, ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలానాత్మకంగా వ్యవహరించాలన్నారు. ఏ సమస్య ఎదురైనా తల్లిదండ్రులు, అధ్యాపకులు సలహాలు తీసుకోవాలని సూచించారు. వ్యాస రచన, వత్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు బహు మతులు అందజేశారు. వైస్ ప్రిన్సిపాల్ సి.రవిశంకర్, అధ్యాపకులు హేమల త, శిరీష, సంధ్య, అమిత, మహాలక్ష్మీ, నోబుల్ రాజు పాల్గొన్నారు.
Updated Date - 2022-11-26T00:02:41+05:30 IST