ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: శ్రీరామవరం చేరుకున్న రైతుల పాదయాత్ర... వైసీపీ, టీడీపీ నినాదాలు.. ఉద్రిక్తం

ABN, First Publish Date - 2022-09-29T19:53:37+05:30

జిల్లాలోని దెందులూరు మండలం శ్రీరామవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరావతి రైతుల పాదయాత్ర కాసేపటి క్రితమే శ్రీరామవరం చేరుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: జిల్లాలోని దెందులూరు మండలం శ్రీరామవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమరావతి రైతుల పాదయాత్ర (Amaravati farmers padayatra) కాసేపటి క్రితమే శ్రీరామవరం చేరుకుంది. ఈ క్రమంలో వైసీపీ (YCP) సర్పంచ్ కామిరెడ్డి నాని(Kamireddy nani) ఇంటి వద్ద టీడీపీ (TDP), వైసీపీ (YCP) కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. జై అమరావతి, జై ప్రభాకర్ అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేయగా... మూడు రాజధానులే ముద్దు,  జై జగన్ అంటూ వైసీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. వైసీపీ జెండాలు చూపిస్తూ  ఆ పార్టీ కార్యకర్తలు నినాదాలు చేశారు. దాదాపు పావుగంట సేపు  నినాదాలు, ప్రతి నినాదాలు  సాగాయి. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలకు నచ్చచెప్పారు. చివరకు టీడీపీ కార్యకర్తలు అక్కడ నుంచి వెళ్లిపోవడంతో వివాదం సద్దుమణిగింది. 


Updated Date - 2022-09-29T19:53:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising