AP News: ఎర్రకాలువకు వరద ఉధృతి... మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
ABN, First Publish Date - 2022-08-09T15:13:08+05:30
భారీ వర్షాల కారణంగా జిల్లాలోని ఎర్రకాలువకు వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది.
పశ్చిమగోదావరి: భారీ వర్షాల కారణంగా జిల్లాలోని ఎర్రకాలువ(Errakalva)కు వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. తాడేపల్లిగూడెం మండలం నందమూరి అక్విడెక్ట్ దగ్గర నీటిమట్టం 30 అడుగులకు చేరింది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నిడదవోలు, తాడేపల్లిగూడెం మండలాలకు వరద (Flood) ముప్పు పొంచి ఉంది. నిడదవోలు మండలం కంసాలిపాలెం, శింగవరం, తాళ్ళపాలెం ప్రాంతాల్లో పొలాల్లోకి వరద నీరు చేరుతోంది.
Updated Date - 2022-08-09T15:13:08+05:30 IST