పీఆర్సీ జీవోలు రద్దు చేయాలి
ABN, First Publish Date - 2022-01-26T05:24:37+05:30
పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని కోరుతూ పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు సంయుక్తంగా మంగళవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కామవరపుకోట, జనవరి 25: పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని కోరుతూ పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు సంయుక్తంగా మంగళవారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎంఈవో కార్యాలయం వద్ద కొద్దిసేపు నినాదాలు చేసి అనం తరం ఏలూరు కలెక్టరేట్ వద్ద ఆందోళనకు తరలివెళ్ళారు. పీఆర్సీ సాధన సమితి మండల కన్వీనర్ జీడీవీ.శ్రీనివాసరావు, సభ్యులు ఎం.నాగేశ్వరరావు, మళ్ళ రాజు, కె.గిరిబాబు, ఎం.శివప్రసాద్, ఎలీషా, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-01-26T05:24:37+05:30 IST