శ్రీవారి దర్శనానికి ఆన్లైన్ టిక్కెట్లు
ABN, First Publish Date - 2022-01-08T05:43:31+05:30
ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక దర్శనం ఆన్లైన్ టికెట్లను భక్తులు ముందుగా బుక్ చేసుకోవచ్చని దేవ స్థానం ఈవో జీవీ సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
ద్వారకాతిరుమల, జనవరి 7 : ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక దర్శనం ఆన్లైన్ టికెట్లను భక్తులు ముందుగా బుక్ చేసుకోవచ్చని దేవ స్థానం ఈవో జీవీ సుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. స్వామి వారి ప్రత్యేక దర్శనానికి రూ. 500 టిక్కెట్లు టైం స్లాట్ పద్ధతిలో ఆన్లైన్లో ఉంచామన్నారు. బుక్ చేసుకునేందుకు www.aptemples.ap.gov.in వెబ్సైట్ను సందర్శించి దేవస్థానం ద్వారకాతిరుమలను క్లిక్ చేసి టిక్కెట్లు బుక్ చేసుకోవాలన్నారు.
Updated Date - 2022-01-08T05:43:31+05:30 IST