నేటి నుంచి డెమో ఎక్స్ప్రెస్ల పునరుద్ధరణ
ABN, First Publish Date - 2022-05-24T06:26:45+05:30
నేటి నుంచి డెమో ఎక్స్ప్రెస్ల పునరుద్ధరణ
నరసాపురం, మే 23: భీమవరం మురికికాల్వ వంతెన మరమ్మతుల కారణంగా ఈనెల19 నుంచి విజయవాడ–నరసాపురం మధ్య తాత్కా లికంగా రద్దయిన డెమో ఎక్స్ప్రెస్లు మంగళవారం నుంచి షెడ్యూల్ ప్రకారం నడుస్తాయని ఎస్ఎం మధుబాబు తెలిపారు. ఉదయం 9.40, మధ్యా హ్నం 2.45 గంటలకు నరసాపురం నుంచి విజయవాడ, సాయంత్రం 4.40, రాత్రి 8.15 గంటలకు విజయవాడ నుంచి నరసాపురం వచ్చే రైళ్లతో పాటు ఉదయం 11.45 గంటలకు విజయవాడ నుంచి భీమవరం వచ్చే ప్యాసింజర్ కూడా యథావిధిగా నడుస్తుందని ఆయన పేర్కొన్నారు.
Updated Date - 2022-05-24T06:26:45+05:30 IST