డెల్టా పేపర్ మిల్లు కార్మికుల పాదయాత్ర
ABN, First Publish Date - 2022-05-20T05:45:18+05:30
వేండ్ర డెల్టా పేపర్మిల్లు తెరవాలని 100 రోజుల నుంచి నిరసన దీక్షలు చేస్తున్నప్పటికీ ఎవరూ కూడా స్పందించకపోవడం దురదృష్ణకరమని డెల్టా పేపర్మి ల్లు జేఏసీ నాయకులు అన్నారు.
పాలకోడేరు, మే 18 : వేండ్ర డెల్టా పేపర్మిల్లు తెరవాలని 100 రోజుల నుంచి నిరసన దీక్షలు చేస్తున్నప్పటికీ ఎవరూ కూడా స్పందించకపోవడం దురదృష్ణకరమని డెల్టా పేపర్మి ల్లు జేఏసీ నాయకులు అన్నారు. డెల్టా పేపర్మిల్లు జేఏసీ కమిటీ గడప గడప పాదయాత్రలో భాగంగా సర్పంచ్ కడలి నాగేశ్వరి, వీరబాబు, ఎంపీటీసీ, వేండ్ర వీఆర్వోకు కరపత్రాలు అందజేశారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ వెయ్యి మంది కుటుంబాలు రోడ్డున పడ్డారు, పరోక్షంగా వేలాది కుటుంబాలు రోడ్డున పడినా ప్రజాప్రతినిధులు, అధికారులు గాని పట్టించుకోవడం లేదన్నారు. త్వరలో డెల్టా పేపర్మిల్లు సమస్య పరిష్కారం చేయకపోతే ఈ నియోజకవర్గం ఓటు బ్యాంకు కోల్పోతారన్నారు. వి.భద్రం, వైఎస్ఎన్.మూర్తి, టి.సుబ్రహ్మణ్యం, పి.అశోక్, కె.వెంకట్రావు, సీహెచ్.కుటుంబరావు, సత్యనారాయణ, కె.మీరయ్య, ఆంజనేయరాజు, ఏఐటీయూసీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-05-20T05:45:18+05:30 IST