రోడ్డు నిర్మాణం చేపట్టాలని సీపీఎం ధర్నా
ABN, First Publish Date - 2022-06-26T05:57:22+05:30
లక్ష్మణేశ్వరం పంచా యతీ పరిధిలోని రాజీవ్నగర్ రోడ్డును తక్షణం నిర్మించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు.
నరసాపురం రూరల్, జూన్ 25: లక్ష్మణేశ్వరం పంచా యతీ పరిధిలోని రాజీవ్నగర్ రోడ్డును తక్షణం నిర్మించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం సీపీఎం అధ్వర్యంలో రహదారి వద్ద సుమారు 200 మంది ధర్నా నిర్వహించారు. రోడ్డు అధ్వానంగా మారడం వల్ల తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుం టున్నాయని అవేదన వ్యక్తం చేశారు. అనేకసార్లు అధికారులకు విన్నవిం చినా పట్టించుకోవడం లేదన్నారు. వైఎస్పాలెం– లక్ష్మణేశ్వరం మధ్య రహదారి పనులు చేపట్టకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు కవురు పెద్దిరాజు, టి.వనమరాజు, జయ, పెద్దిరాజు, మహాలక్ష్మి, కె.రాజు పాల్గొన్నారు.
Updated Date - 2022-06-26T05:57:22+05:30 IST