ఎంప్లాయీస్ కాలనీ వాసుల నిరసన
ABN, First Publish Date - 2022-08-13T06:12:03+05:30
తమ కాలనీలో సమస్యలను పరిష్కరిం చాలని నూజి వీడు ఎంప్లాయిస్ కాలనీ వాసులు వార్డు సచివాలయం వద్ద నిరసన తెలిపారు.
నూజివీడు టౌన్, ఆగస్టు 12: తమ కాలనీలో సమస్యలను పరిష్కరిం చాలని నూజి వీడు ఎంప్లాయిస్ కాలనీ వాసులు వార్డు సచివాలయం వద్ద నిరసన తెలిపారు. కాలనీలో డ్రైనేజీ సమస్యతో పాటు తుప్పలు పెరగడంతో విష కీటకాలు చేరుతున్నాయని, కాలనీ ఏర్పడి 35 ఏళ్లు దాటినా, నేటికి మురుగునీటిపారుదల వ్యవస్థ ఏర్పాటు చేయలేదని, తక్షణం మురుగు తరలించే ఏర్పాట్లు చేయాలని రిటైర్డ్ ఎల్ఐసీ ఉద్యోగి ఎన్.ఆర్. హనుమాన్లు డిమాండ్ చేశారు. కాలనీ వాసులు జి.రాజు, ఎల్.రమేష్, ఇస్మాయేల్, కాంతమ్మ, స్వాతి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-08-13T06:12:03+05:30 IST