భీమడోలులో ఆలస్యంగా వెలుగులోకి లంచావతారం
ABN, First Publish Date - 2022-06-28T02:11:38+05:30
భీమడోలు (Bheemadolu)కి చెందిన ప్రభుత్వ అధికారి లంచం తీసుకున్నారు. భీమడోలు పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న రమేష్ గుప్తా (Ramesh Gupta).. ఓ వ్యక్తి..
ఏలూరు (Eluru): భీమడోలు (Bheemadolu)కి చెందిన ప్రభుత్వ అధికారి లంచం తీసుకున్నారు. భీమడోలు పంచాయతీ కార్యదర్శిగా పని చేస్తున్న రమేష్ గుప్తా (Ramesh Gupta).. ఓ వ్యక్తి వద్ద పన్నెండు వేలు లంచం (Bribe) తీసుకున్నాడు. అది సాక్షాత్తు సచివాలయ ప్రాంగణంలోనే జరిగింది. కొన్ని కాంట్రాక్ట్ పనుల బిల్లులు సకాలంలో చెల్లించేందుకు పంచాయతీ కార్యదర్శి రమేష్కు సదరు వ్యక్తి లంచం ఇచ్చారు. అయితే ఉన్నతాధికారులు స్పందించి పంచాయతీ కార్యదర్శి రమేష్ అక్రమాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
ఇక ఈ లంచం బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రమేష్ గుప్తా లంచం తీసుకున్న వీడియో (Video) సోషల్ మీడియా (Social Media)లో వైరల్గా మారింది. అయితే లంచం వీడియో ఆలస్యంగా వెలుగులోకి రావడంపై పలు అనుమానాలు కలుగుతున్నాయి
Updated Date - 2022-06-28T02:11:38+05:30 IST