అల్లూరిని యువత ఆదర్శంగా తీసుకోవాలి
ABN, First Publish Date - 2022-06-30T05:37:45+05:30
స్వాతంత్య్ర పోరాటంలో దేశచరిత్రలో శాశ్వతంగా నిలిచిన విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు భారతజాతి ఉన్నంత వరకు ధ్రువతారగా వెలుగొందుతారని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.
భీమవరం టౌన్, జూన్ 29 : స్వాతంత్య్ర పోరాటంలో దేశచరిత్రలో శాశ్వతంగా నిలిచిన విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు భారతజాతి ఉన్నంత వరకు ధ్రువతారగా వెలుగొందుతారని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. అల్లూరి జయంత్యుత్సవాల్లో భాగంగా బుధవారం ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్, డీఎన్ఆర్ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించిన సద్భావనా యాత్రను ఆయన ప్రారంభించి మాట్లాడారు. భీమవరం పట్టణంలో ఒకే వారంలో ఇద్దరు మహోన్నత వ్యక్తులైన స్వామి వివేకానంద, అల్లూరి సీతారామరాజు విగ్రహాలవిష్కరణ జరగడం దేశానికి గర్వకారణమన్నారు. అనంతరం ర్యాలీ ప్రకాశం చౌక్ నుంచి ప్రారంభమై జువ్వలపాలెం రోడ్డు మీదుగా అల్లూరి విగ్రహం వరకు సాగింది. క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు, ఏఎస్పీ సుబ్బరాజు, డీఎన్ఆర్ కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు గోకరాజు వెంకట నరసింహరాజు, గాదిరాజు సుబ్బరాజు, కంతేటి వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-06-30T05:37:45+05:30 IST