రోడ్డు నిర్మించాలంటూ ధర్నా
ABN, First Publish Date - 2022-06-28T05:16:29+05:30
మా రోడ్డు పోయి ఏళ్లు గడుస్తుంది...
నరసాపురం టౌన్, జూన్ 27: మా రోడ్డు పోయి ఏళ్లు గడుస్తుంది... కనీస మరమ్మతులు కూడా చేపట్టలేదని లక్ష్మణేశ్వరం రాజీవ్నగర్ ప్రాంత వాసులు సోమవారం అర్అండ్బి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. చిన్నపాటి వర్షం వస్తే రోడ్లు కాల్వలను తలపిస్తున్నాయన్నారు. అధికారులు స్పందించి రహదారి నిర్మించాలని డిమాండ్ చేశారు. అక్కడ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్లి ధర్నా నిర్వహించారు. వారి అందోళనకు సీపీఎం మద్దతు పలికింది. కవురు పెద్దిరాజు, ఎం త్రిమూర్తులు, ఎం.రామకృష్ణ, వనమరాజు, లక్ష్మి, వెంకటేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-06-28T05:16:29+05:30 IST