ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కారు గెలుచుకున్నారంటూ ఫోన్... రూ.90వేలు స్వాహా

ABN, First Publish Date - 2022-06-18T14:52:47+05:30

కారు గెలుచుకున్నారంటూ ఫోన్ చేసి రూ.90వేలు స్వాహా చేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పశ్చిమగోదావరి: కారు గెలుచుకున్నారంటూ ఫోన్ చేసి రూ.90 వేలు స్వాహా చేసిన ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. భీమవరం మండలం దిరుసుమర్రు గ్రామానికి చెందిన రాజబాబు అనే వ్యక్తికి మీ ఫోన్ నెంబరుకు నాస్టాల్ కంపెనీ నుంచి కారు గెలుచుకున్నారంటూ ఫోన్ వచ్చింది. ఈ క్రమంలో నగదు జమ చేయాలంటూ సదరు వ్యక్తులు రాజబాబుకు తెలిపారు. కారు గెలుచుకున్నానన్న ఆనందంలో ఉన్న రాజబాబు... కంపెనీ పేరిట చెప్పిన ఫోన్ నెంబరుకు ఫోన్ పే ద్వారా రూ.90 వేల నగదు వేశాడు. అయితే ఆ తరువాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ నెంబర్ పని చేయకపోవడంతో మోసపోయినట్లు బాధితుడు గుర్తించాడు. ఈ విషయంపై బాధితుడు రాజాబాబు భీమవరం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-06-18T14:52:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising