Tirupati: వారాంతపు ప్రత్యేక రైళ్లు
ABN, First Publish Date - 2022-07-20T12:32:28+05:30
ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా 30 వారాంతరపు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. హైదరాబాద్ -తిరుపతిల మధ్య
తిరుపతి: ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా 30 వారాంతరపు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్ రాకేష్ తెలిపారు. హైదరాబాద్ -తిరుపతిల మధ్య 07643 ప్రత్యేకరైలు ఈ నెల 25 ఆగస్టు 1, 8, 15, 22, 29 తేదీలలో హైదరాబాద్లో రాత్రి 7.30 గంటలకు బయలు దేరి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మార్గంలో ప్రయాణిస్తూ మరుసటి రోజు ఉదయం 10 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతిలో ఈ ప్రత్యేక రైలు 07544 ఈ నెల 26 ఆగస్టు 2, 9, 16, 23, 30 తేదీలలో మధ్యాహ్నం 3 గంటలకు బయలు దేరి వచ్చిన మార్గంలోనే ప్రయాణిస్తూ మరుసటి రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్కు చేరుకుంటుంది. ఫ నరసాపూర్లో ఈ ప్రత్యేక రైలు 07613 ఈ నెల 26 ఆగస్టు 2, 9,16, 23, 30 తేదీలలో రాత్రి 8.45 గంటలకు బయలు దేరి పాలకొల్లు, భీమవరం, కైకలూరు, గుడివాడ, విజయవాడ, ఒంగోలు, గూడూరు, రేణిగుంటల మీదుగా మరుసటి రోజు ఉదయం 8 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. తిరుపతిలో ఈ ప్రత్యేక రైలు 07614 ఈ నెల 27 ఆగస్టు 3, 10, 17, 24, 31 తేదీలలో మధ్యాహ్నం 3 గంటలకు బయలు దేరి రేణిగుంట, రాజంపేట, కడప, తాడిపత్రి, గుత్తి, డోన్, కర్నూల్, గద్వాల, జడ్చర్ల, హుందానగర్ల మీదుగా కాచిగూడకు ఉదయం 4 గంటలకు చేరుకుంటుంది.
Updated Date - 2022-07-20T12:32:28+05:30 IST