నీటివనరుల ఆక్రమణపై సర్వే చేస్తున్నాం
ABN, First Publish Date - 2022-08-17T10:13:19+05:30
రాష్ట్ర వ్యాప్తంగా నీటివనరులు, చెరువుల ఆక్రమణలపై ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోందని, పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టును అభ్యర్థించారు.
వివరాలు కోర్టు ముందుంచేందుకు సమయమివ్వండి
హైకోర్టును కోరిన ఏజీ
అమరావతి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా నీటివనరులు, చెరువుల ఆక్రమణలపై ప్రభుత్వం సర్వే నిర్వహిస్తోందని, పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు సమయం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్(ఏజీ) ఎస్.శ్రీరామ్ హైకోర్టును అభ్యర్థించారు. ఆ వివరాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను నాలుగువారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎ్సఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలిచ్చింది. నీటివనరుల ఆక్రమణలపై ఉత్తర్వులు జారీచేసే నిమిత్తం హైకోర్టు సుమోటో పిల్ నమోదు చేసిన సంగతి తెలిసిందే.
Updated Date - 2022-08-17T10:13:19+05:30 IST