YCP Plenaryలో మంత్రి నిద్ర.. నాయకులు ఫుల్.. జనం నిల్..
ABN, First Publish Date - 2022-06-29T16:31:24+05:30
వైసీపీ ఫ్లీనరీ (YCP Plenary)లో ఓ మంత్రి (Minister) హాయిగా కునుకు తీశారు.
ఇంటర్నెట్ డెస్క్ (Internet Desk): వైసీపీ ఫ్లీనరీ (YCP Plenary)లో ఓ మంత్రి (Minister) హాయిగా కునుకు తీశారు. ఆదమరిచి నిద్ర పోయిన మంత్రికి నిద్రాభంగం కలగకుండా నాయకులు కూడా జాగ్రత్తపడినట్లు అనిపించింది. ఇరువైపుల కూర్చున్న నేతల ప్రసంగాలు మంత్రికి జోలపాటలా అనిపించిందేమో.. హాయిగా నిద్రలోకి జారుకున్నారు.
ఏపీలో వైసీపీ ఫ్లీనరీలు ‘నాయకులు ఫుల్.. జనం నిల్’.. అన్న చందంగా మారాయి. విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో వైసీపీ ఫ్లీనరీలు జనం లేక వెలవెలబోయాయి. ఈ క్రమంలోనే సాలూరు, బొబ్బిలిలో జరిగిన ఫ్లీనరీలకు మంత్రి బొత్స 9Minister Botsa), ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర (Rajannadora)తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఫ్లీనరీ ప్రారంభం నుంచి పలు సందర్భాల్లో కునుకు తీస్తున్న మంత్రి బొత్స మరోసారి నిద్రలోకి జారుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే మునుపెన్నడూ లేని విధంగా సత్తిబాబును చూసిన నేతలు ఆయనకు నిద్రాభంగం కలగనీయలేదు.
ఇక సాలూరు సభలో అయితే వచ్చిన కార్యకర్తలే తక్కువ. సభ ప్రారంభం కాగానే మూడొంతుల జనం ఇంటి ముఖం పట్టారు. ఎక్కువ శాతం ఖాళీ కుర్చీలకు నేతలు ప్రసంగాలు వినిపించాల్సి వచ్చింది. నాలుగు మండలాల నుంచి ఆశించిన స్థాయిలో కార్యకర్తలు రారనుకున్నారో.. రాలేరనుకున్నారో గానీ.. బొబ్బిలో కొద్దిపాటి హాలులో ఫ్లీనరీ జరిపించేశారు. ఫ్లీనరీ సభ నిర్వహించి మమా అనిపించారు. అయితే సారూలు సభలోనూ మంత్రి బొత్స కునుకు తీశారు. మంత్రి నిద్రపోవడాన్ని గమనించిన నేతలు, కార్యకర్తలు.. ‘‘జో సత్తిబాబన్న జోజోముకుందా.. లాలిపరమానంద జగన్ గోవిందా’’ అని సరదాగా పాడుకోవాల్సి వచ్చింది. మొత్తంగా ఇప్పటికే పలుసార్లు మంత్రి బొత్స నిద్రపోతూ కనబడి సమస్యలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా మరోసారి ఫ్లీనరీ సమావేశంలో కునుకుతీసి బుక్ అయ్యారు.
Updated Date - 2022-06-29T16:31:24+05:30 IST