పార్టీ బలోపేతానికి కృషి చేయండి
ABN, First Publish Date - 2022-12-06T23:53:02+05:30
గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ బలోపేతం కోసం బూత్ లెవల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యవర్గ కార్యదర్శి వి.సన్యాసినాయుడు కోరారు.
గుర్ల: గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీ బలోపేతం కోసం బూత్ లెవల్లో ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యవర్గ కార్యదర్శి వి.సన్యాసినాయుడు కోరారు. మంగళవారం స్థానిక టీడీపీ మండల కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు సీహెచ్ మహేశ్వర్ ఆధ్వర్యలో పార్టీ సీనియర్ నాయకు లు, కార్యకర్తలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా సన్యాసి నాయుడు మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం బూత్ లెవల్లో కార్యకర్తలు కష్టప డి పనిచేయాలన్నారు. ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసే విధంగా, వాటిని సరిచేసే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు కిలారి సూర్యనారాయ ణ, ప్రధాన కార్యదర్శి పిల్ల అప్పలనాయుడు, ఆత్మ మాజీ డైరక్టర్ కనిమెరక కృష్ణ, నియో జకవర్గ బీసీ సెల్ ప్రధా న కార్యదర్శి దాసరి శివప్రసాద్, పీఆర్పేట గ్రామ పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరావు, టీఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు కోరాడ రామకృష్ణ, పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ నాగులపల్లి నారాయణరావు, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామీణ నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-06T23:53:05+05:30 IST