పార్వతీపురం ఐటీడీఏ పీవోగా విష్ణుచరణ్
ABN, First Publish Date - 2022-10-09T05:28:06+05:30
పార్వతీపురం ఐటీడీఏ పీవోగా విష్ణుచరణ్ను ప్రభుత్వం నియమించింది. 2019 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆయన నర్సాపురం సబ్కలెక్టర్గా పనిచేస్తున్నారు.
పార్వతీపురం, అక్టోబరు8 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం ఐటీడీఏ పీవోగా విష్ణుచరణ్ను ప్రభుత్వం నియమించింది. 2019 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఆయన నర్సాపురం సబ్కలెక్టర్గా పనిచేస్తున్నారు. అయితే పార్వతీపురం ఐటీడీఏ పీవోగా బదిలీ చేస్తూ.. శనివారం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఐటీడీఏ పీవోగా పనిచేసిన కూర్మనాఽథ్ నెల్లూరు జిల్లాకు జాయింట్ కలెక్టర్గా బదిలీపై వెళ్లారు. ఆ తర్వాత ప్రస్తుత జాయింట్ కలెక్టర్ ఆనంద్ ఐటీడీఏ పీవో భాధ్యతలను నిర్వహిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఎట్టకేలకు పార్వతీపురం ఐటీడీఏకు పీవోగా విష్ణుచరణ్ను నియమించింది. త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు.
Updated Date - 2022-10-09T05:28:06+05:30 IST