గిరిజనుల నిరసన
ABN, First Publish Date - 2022-11-23T00:28:05+05:30
షెడ్యూల్డ్ ఏరియా ధ్రువపత్రాలు మంజూరు చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు.
షెడ్యూల్డ్ ఏరియా ధ్రువపత్రాలు మంజూరు చేయాలని డిమాండ్
సాలూరు, నవంబరు 22: షెడ్యూల్డ్ ఏరియా ధ్రువపత్రాలు మంజూరు చేయాలని గిరిజనులు డిమాండ్ చేశారు. మంగళవారం రాత్రి సాలూరు తహసీల్దార్ కార్యా లయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. తామంతా షెడ్యూల్డ్ ఏరియాకు చెందిన వారిమేనని కోర్టు చెబుతున్నా ప్రభుత్వం ఎందుకు ధ్రువపత్రాలు మంజూరు చేయడం లేదని ప్రశ్నించారు. ‘ఆదివాసీ మేలుకో, గిరిజనుడా మేలుకో ’ అనే నినాదంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మక్కువ మండలానికి చెందిన గిరిజన యువకులు నిమ్మక సింహాచలం, గిరిధర్రావు తెలిపారు. తాము షెడ్యూల్డ్ ఏరియా ధ్రువపత్రాల కోసం దరఖాస్తు చేసుకుంటే అధికారులు అదుగో.. ఇదుగో అని తిప్పుతున్నారన్నారు. తమ సమస్య పరిష్కారమయ్యే వరకూ నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నిరసనలో గిరిజన సంఘం, ఆదివాసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.
Updated Date - 2022-11-23T00:28:07+05:30 IST