కన్ఫ్యూజన్లో రాష్ట్ర పాలన: Ashok gajapathi
ABN, First Publish Date - 2022-01-18T16:08:07+05:30
రాష్ట్రంలో పాలన అంతా కన్ఫ్యూజన్లో ఉందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు అశోక్ గజపతి రాజు అన్నారు.
విజయనగరం: రాష్ట్రంలో పాలన అంతా కన్ఫ్యూజన్లో ఉందని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యులు అశోక్ గజపతి రాజు అన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా జిల్లాలోని కోట జంక్షన్లో మహానేత విగ్రహానికి అశోక్ గజపతి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీడీపీ పాలన ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కొనసాగిందని... ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదని తెలిపారు. ప్రార్ధనా స్థలాలకు వెళితే కరోనా పెరుగుతాదట... మరి పాఠశాలల్లో పెరగదా...? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ బద్ధంగా నడపడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. కరోనా జాగ్రత్తలు తీసుకొని ప్రజా సమస్యలపై పోరాడాలని డిమాండ్ చేశారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ను నిర్వీర్యం చేసేలా ప్రభుత్వ పాలన ఉందన్నారు. అందుకే కోవిడ్ నియంత్రణపై సరైన కట్టడి లేదని అశోక్గజపతి రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated Date - 2022-01-18T16:08:07+05:30 IST