ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చోరీ కేసులో ఒకరి అరెస్టు

ABN, First Publish Date - 2022-12-06T23:48:19+05:30

చోరీ కేసుకు సంబంధించి పట్టణానికి చెందిన పొడుగు సతీష్‌ అనే నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు సీఐ మలిరెడ్డి నాగేశ్వరరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బొబ్బిలి: చోరీ కేసుకు సంబంధించి పట్టణానికి చెందిన పొడుగు సతీష్‌ అనే నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు సీఐ మలిరెడ్డి నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ పరిధి అప్పయ్యపేటలో పెంట గ్రామ వీఆర్వో మరిపి రవి అప్పారావు ఇంట్లో సెప్టెంబరు 27 అర్ధరాత్రి చోరీ జరిగింది. ఇంట్లో బీరువాను పగులగొట్టి రెండున్నర తులాల బంగారు నక్లెస్‌, వన్‌ప్లస్‌ మొబైల్‌ను అపహరించుకుపోయారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా మంగళవారం పట్టణంలోని మేదరబంద జంక్షన్‌లో ఎస్‌ఐ వి.జ్ఞానప్రసాద్‌, పోలీ సులను చూసి నిందితుడు సతీష్‌తో పాటు మరో ఇద్దరు పారిపోవడానికి యత్నిం చారు. ఇది గమనించిన పోలీసులు వారిని వెంబడించి పట్టుకుని ఆరా తీశారు. దీంతో అసలు విషయం బయటపడింది. నేరం ఒప్పుకోవడంతో వారి నుంచి బంగా రం, ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు సతీష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించగా, మిగిలిన ఇద్దరు మైనర్లు కావడంతో సొంత పూచీ కత్తుపై వారి తల్లిదండ్రులకు అప్పగించామని సీఐ తెలిపారు.

Updated Date - 2022-12-06T23:48:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising